అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రాలో రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులుతోపాటు తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయి. రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతుండటంతో వీటి ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని తెలిపారు. రానున్న 24 గంటల్లో రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.