అమరావతి : నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం మండంలో ఉన్న ఫార్మసీ కాలేజీలో విద్యార్థినుల ర్యాగింగ్ కలకలం సృష్టిస్తోంది. డీపీటీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కొందరు ర్యాగింగ్ చేయడంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. సమీపంలో ఉన్న రైలు కింద పడగా ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రైల్వే పోలీసులు స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.