చిత్తూరు: ప్రభుత్వం చేసే అక్రమాలపై ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులపై పోలీసులు అర్ధరాత్రి దాడులు చేసి అరెస్టు చేయడం విచారకరమని, తామేమైనా తీవ్రవాదులమా అని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు అమర్నాథ్రెడ్డి అన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతూ గుండాళ్ల వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
పోలీసులకు ఫిర్యాదులు చేయడానికి వెళ్తే తమపైనే కేసులు పెట్టడం దారుణమని అన్నారు. కుప్పంలో బెదిరింపులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.