అమరావతి : ఆంధ్రప్రదేశ్లో దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసమే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeshwari) వెల్లడించారు. ఆదివారం విజయవాడలో బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. ఏపీ బీజేపీ (BJP) నాయకుల అభిప్రాయాలను తెలుసుకున్నారని వివరించారు.
టీడీపీ, జనసేనలతో పొత్తులు సంతోషకరమని అన్నారు. ఎవరికి ఎన్ని సీట్లు, ఏఏ నియోజకవర్గాల నుంచి పోటీ అనే అంశం రెండు, మూడు రోజుల్లో ఖరాలు అయ్యే అవకాశం ఉందన్నారు. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకునే సామర్ధ్యం గల కార్యకర్తలను అధిష్టానం తీసుకునే నిర్ణయాలన్నింటికి కట్టుబడి ఉంటారని వెల్లడించారు.