అమరావతి : ఏపీలో త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) పోటీ చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్న నాయకులకు శనివారం టీడీపీ(TDP) విడుదల చేసిన జాబితాలో పేర్లు లేకపోవడంతో టీడీపీ నాయకులు, వారి అనుచరులు నిరసనలు వ్యక్తం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన(Janasena) మధ్య కుదిరిన ఒప్పందం మేరకు శనివారం రెండు పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్కల్యాణ్ మొత్తం 118 సీట్లకు పొత్తులకు గాను 99 సీట్లకు అభ్యర్థుల ఖరారు జాబితాను ప్రకటించారు.
పొత్తుల్లో భాగంగా టికెట్లు రాని నాయకులు రాజీనామాల బాట పట్టారు. పి. గన్నవరం టికెట్ మహాసేన రాజేశ్కు కేటాయించడం గన్నవరం (Gannavaram) టీడీపీ మండల అధ్యక్షుడు సత్తిబాబు పార్టీకి రాజీనామా చేశారు. అనకాపల్లి లో జనసేన నాయకుడు కొణతాల రామకృష్ణకు కేటాయించడంతో దేశం శ్రేణులు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కరపత్రాలను దగ్ధం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతపురం(Anantapuram) జిల్లా శింగనమల నియోజకవర్గానికి బండారు శ్రావణి పేరును ప్రకటించడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. అనంతపురం టీడీపీ కార్యాలయంలోని కిటికి అద్దాలను ధ్వంసం చేసి నిరసన తెలిపారు.