అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికులు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమకు న్యాయం చేయాలని కోరారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద వంటావార్పు కార్యక్రమం చేపట్టారు.
కూర్మన్నపాలెం గేటు నుంచి స్టీల్ ప్లాంట్ ప్రధాన గేటు వరకు సుమారు ఏడు కిలోమీటర్లు కుటుంబ సభ్యులతో కలిసి వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు.