అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లాలో రజకులు వినూత్న నిరసన తెలిపారు. గాడిదలతో మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లి ధర్నా నిర్వహించారు. కర్నూలు పట్టణంలో రోడ్లపై విచ్చలవిడిగా తిరుగు తున్న గాడిదలను నగర మున్సిపల్ సిబ్బంది వాటిని పట్టుకుని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. నగరంలోని రోడ్లపై గాడిదల సంచారంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నాయని వాటిని తీసుకొచ్చి మున్సిపల్ ఆవరణలో బంధించారు.
గాడిదల వల్లే తమకు ఉపాధి ఉందని, వాటిపైనే తమ వృత్తి ఆధారపడి ఉందని పేర్కొంటూ నగరానికి చెం దిన రజక వృత్తిదారుల సంఘం నాయకులు ఇవాళ మరికొన్ని గాడిదలతో వచ్చి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. పట్టుకున్న గాడిదలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రజకులకు దోభిఘాట్లను, గాడిదల కోసం షెడ్లను నిర్మించాలని సంఘం నాయకులు కోరారు. ప్రత్యేక షెడ్లను నిర్మిస్తే గాడిదలను రోడ్లపైకి కాకుండా షెడ్లలో ఉంచుతామని పేర్కొన్నారు.