అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్లకు పదోన్నతి కల్పిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సీనియర్ ఐపీఎస్లకు డీజీలుగా ప్రమోషన్ కల్పిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. అంజనాసిన్హా, పీఎస్ఆర్ ఆంజనేయులు, మాదిరెడ్డి ప్రతాప్, మహ్మద్ అసన్రాజా, కే. రాజేంద్రనాథ్రెడ్డి , గోపీనాథ్ జెట్టి, సెంథిల్ కుమార్, పేముషీ, నళిని ప్రభాత్ గజరవు భూపాల్, నవదీప్సింగ్, ఎల్కేవీ రంగారావు, నవీన్ గులాటి, పి. వెంక్రటామిరెడ్డి, కాంతిరాణా టాటా పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.