తిరుపతి: తిరుపతిలోని టిటిడికి చెందిన బర్డ్ ఆసుపత్రిలో ఓపీసేవల కోసం ముందస్తుగా అపాయింట్మెంట్ తీసుకోవాలని ఆసుపత్రి ప్రత్యేకాధికారి డా.రాచపల్లి రెడ్డప్పరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇందుకోసం రోగులు 7337318107 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని వైద్యం పొందాలని ఆయన కోరారు.