అమరావతి : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( President Draupadi Murmu ) విశాఖ పట్నానికి చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె విశాఖ ( Visaka ) నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ( Pawan Kalyan ) , మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్వాగతం పలికారు.
విశాఖపట్నంలో జరుగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ( ఐఎఫ్ఆర్)లో పాల్గొనేందుకు ఆమె విశాఖకు చేరుకున్నారు. రేపు జరుగనున్న కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర గవర్నర్, డిప్యూటీ సీఎం, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్ తదితరులు హాజరు కానున్నారు.