అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మరో అవినీతి చేప ఏసీబీ అధికారులకు చిక్కింది. విద్యుత్ లైన్మెన్ వినియోగదారుడు నుంచి లంచం తీసుకుంటూ రెడ్ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కాకినాడ జిల్లా సర్పవరం కూడలిలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లో లైన్మెన్గా పనిచేస్తున్న సిద్ధార్థ రూ. 20వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లైన్మెన్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.