అమరావతి : ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5న దేశవ్యాప్తంగా నిర్వహించవలిసిన యూజీసీ-నెట్ పరీక్షను జాతీయ పరీక్షల విభాగం వాయిదా వేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్లో) ఎంబీఏ ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షను సైతం జాతీయ పరీక్షల విభాగం వాయిదా వేసింది.
జవాద్ తుఫాన్ ప్రభావముండే ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు . తదుపరి తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు వారు పేర్కొన్నారు.