అమరావతి : ఈ నెల 8న నిర్వహించవలిసిన విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సటీ స్నాతకోత్సవం వాయిదా పడింది. ఇటీవల ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు చెందిన నిధులన్నీ ఏపీ పైనాన్సియల్ కార్పొరేషన్కు మళ్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంట్లో భాగా ఈ వర్సిటీ చెందిన 480 కోట్ల రూపాయలను మళ్లించడంతో ఉద్యోగులు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపడుతున్నారు. వర్సిటీలో ఉద్యోగులు, విద్యార్థులు జేఏసీగా ఏర్పడి ప్రతిరోజు నిరసనలు, విధుల బహిష్కరణలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఉద్యోగులు, విద్యార్థుల సహకారం లేనిదే కార్యక్రమాలు నిర్వహించడం భావ్యం కాదనే ఉద్దేశంతో 8న నిర్వహించాల్సిన స్నాతకోత్సవాన్ని వాయిదా వేశారు.
2019-20, 2020-21 రెండేళ్ల స్నాతకోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేసి చాలామంది ప్రముఖులను ఆహ్వానించారు. రెండేళ్లకు సంబంధించి 500మందికి పతకాలు అందించాలని నిర్ణయించారు. స్నాతకోత్సవానికి సహకరించాలని రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపినా ఫలితం లేకపోగా సోమవారం నుంచి తమ ఉద్యమాన్ని మరింత వేగవంతం చేయనున్నట్లు జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.