అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించక ఆందోళన బాట పడుతున్నారు. గత 15 రోజులుగా జనవరి వేతనాలు, పింఛన్లు చెల్లించకపోవడంతో ఈరోజు నుంచి సహాయ నిరాకరణకు సిద్ధమయ్యారు. దీంట్లో భాగంగా కడపలోని ఆర్టీపీపీలో ఇంజినీర్లు, ఉద్యోగులు విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
వేతనాలు చెల్లించేంత వరకు నిరసన చేస్తామని హెచ్చరించడంతో మంత్రి బాలినేని స్పందించారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కారిస్తామని చర్చలకు ఆహ్వానించ డంతో విద్యుత్ ఉద్యోగులు సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని వాయిదా వేశారు . వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో వాయిదా వేసుకున్నామని విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు.
కాగా కృష్ణపట్నం విద్యుదుత్పత్తి కేంద్రం ప్రైవేటీకరణపై నిర్వహిస్తున్న ఆందోళనను యథాతథంగా కొనసాగిస్తున్నారు.