అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ ఏపీలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) దుయ్యబట్టారు. ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని మరో పార్టీతో రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. పవన్(Pawan Kalyan), చంద్రబాబు(Chandra Babu) ను టీడీపీ, జనసేన నాయకులను నమ్మొద్దని ఆ పార్టీ కార్యకర్తలకు సూచించారు.
పవన్ మాటలు చిత్రంగా, ఆశ్చర్యకరంగా ఉంటున్నాయని పేర్కొన్నారు. ఓట్లు కొనుక్కోకూడదని చెగువేరాలాగా కాకమ్మ కథలు చెబుతున్నాడని ఆరోపించారు. బుధవారం కుప్పంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) చేసిన వ్యాఖ్యలపై అంబటి విమర్శలు గుప్పించారు.
రాజ్యసభలో టీడీపీ సభ్యత్వం లేకుండా పోయింది. ఇక చంద్రబాబుకు రెస్ట్ తీసుకోమని చెబుతున్న విషయం వెనుక కుప్పంలో కుర్చీ కూడా మడత పెట్టేశారని అర్ధమవుతుందని వెల్లడించారు. చంద్రబాబు, లోకేష్కు రెస్ట్ ఇచ్చి ఎన్టీఆర్ కుమార్తె కుప్పంలో పోటీ చేసినా కుప్పంలో ఓడిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని అన్నారు.