అమరావతి: విజయనగరం పట్టణంలో ఈనెల 23న రవి జ్యువెల్లరీ దుకాణంలో జరిగిన భారీ చోరీ ఘటనను పోలీసులు ఛేదించారు. ఛత్తీస్గఢ్ కు చెందిన లోకేశ్ శ్రీవాస్ను విజయనగరం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 6.18 కిలోల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. గంటస్తంభం వద్ద రవి జువెల్లర్స్లో పైకప్పు నుంచి దుకాణంలో చొరబడి 8 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు.
దుకాణం యజమాని కోట రామ్మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు పాత నేరస్థుడు లోకేశ్ శ్రీవాస్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడని ఎస్పీ దీపికా వెల్లడించారు. నిందితుడు విజయనగరంలో 3 కేసులు, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మరో 11 కేసులో పాల్గొన్నాడని తెలిపారు. అతడిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు వివరించారు.