అమరావతి: కేంద్రం అన్ని రకాల సెస్లు తగ్గిస్తే రూ.50కే లీటర్ పెట్రోలు ఇవ్వవచ్చని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెట్రోలు, డీజిల్ ధరలను ప్రతిరోజు పెంచి ఇటీవల కేంద్రం మొక్కుబడిగా తగ్గించిందని ఆయన విమర్శించారు. రోజువారీగా చమురు ధరలను పెంచిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెందిన వారే ధరలను తగ్గించాలని ఏపీలో ధర్నాలు చేయడం సిగ్గుచేటని అన్నారు.
కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే చమురుపై అన్ని రకాల సెస్లు తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్రం వసూలు చేసే పన్నులను ఎక్సైజ్ డ్యూటీ పరిధిలోకి తీసుకువస్తే తాము ధరలను తగ్గిస్తామని అన్నారు. ఏపీలో విద్యాసంస్థల విలీనాన్ని బలవంతం చేయడం లేదని, ఇప్పటికే 101 సంస్థలు విలీనంపై సంతకాలు చేశాయని వెల్లడించారు.