అమరావతి : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం హర్షనీయమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. గత కొన్ని నెలలుగా ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పెట్రో ధరల తగ్గింపు కాస్త ఉపశమనం కలిగించిందని పేర్కొన్నారు. కేంద్రం ప్రకటనతో అల్పాదాయ, మధ్యతరగతి ప్రజలకు సాంత్వన కలిగిందన్నారు.
అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీలోనే పెట్రో ధరలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం రోడ్సెస్ పేరుతో ప్రజల నుంచి ఏటా రూ . 600 కోట్లు వసూలు చేస్తుందని, రాష్ట్రం కూడా పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు.