శ్రీశైలం : ఆయుర్వేదం, యోగాసనాలతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శ్రీశైలం ఈవో లవన్న అన్నారు. శనివారం ఆలయ దక్షిణ మాఢవీధిలో ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాంత్రిక జీవనానికి అలవాటు పడి ఆరోగ్యంపై అశ్రద్ధ వహించడం వల్ల వచ్చే వ్యాధులను ఎదుర్కొనేందుకు ఆయుర్వేదమే సరైన పరిష్కారమని పేర్కొన్నారు.
యోగాసనాలతో రోగ నిరోధక శక్తి పెరిగి, మానసిక ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. సూర్యనమస్కారాలు చేయడం వలన కండరాలు, అవయావాలు సవ్యంగా పనిచేస్తాయని ఈవో చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు పీవీ లక్ష్మి, నాడీవైద్య నిపుణురాలు పూర్ణ రాజేశ్వరి, పీఆర్వో శ్రీనివాస్ రావు, దేవస్థాన సిబ్బంది, ఆగమ పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్ధులతో పాటు భక్తులు పాల్గొన్నారు.