AP Cabinet | సామాజిక పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. సుమారు 45 అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జనవరిలో ఆసరా, చేయుత పథకాలు అమలు చేయాలని నిర్ణయించింది.
అలాగే ఆరోగ్య శ్రీ చికిత్స పరిధిని రూ.25 లక్షల పెంపునకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్కు కూడా ఆమోదముద్ర వేసింది. వైజాగ్లో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. కుల, ఆదాయ, ధృవీకరణ పత్రాల మంజూరులో కీలక సంస్కరణలకు ఆమోదం తెలిపింది.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే..
– సామాజిక పింఛన్లు 3 వేల పెంపునకు ఆమోదం
– వైజాగ్లో 4 కారిడార్లలో లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్కు ఆమోదం
– మధురవాడలో ఓ ప్రైవేటు విద్యాసంస్థకు 11 ఎకరాలు కేటాయింపు
– నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాల్లో 287 పోస్టుల భర్తీకి ఆమోదం
– శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం మెడికల్ కాలేజీల్లో ఆంకాలజీ విభాగం ఏర్పాటుకు నిర్ణయం