అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వ తీరుపై ట్విటర్ ద్వారా మండిపడ్డారు. ‘ వరదల బీభత్సం ఒక వైపు రాష్ట్రాన్ని కుదిపేస్తుంటే.. ప్రజల ఇళ్లు, వాకిళ్లు, పశు నష్టం, పంట నష్టం జరుగుతుంటే పట్టించుకోవడం లేదని అన్నారు.
పచ్చటి పొలాల్లో ఇసుక మేటలు వేసి ఏడుస్తుంటే ఇలాంటి సమయంలో వైసీపీ ప్రభుత్వం ఇసుక అమ్ముతాం అన్న ప్రకటనలు ఇస్తున్నారు., అసలు ఈ ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం ఉందా ..? అని ట్విట్ చేశారు.