అమరావతి : జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) పార్టీకి రూ. 10 కోట్ల విరాళాన్ని అందజేశారు. పార్టీ నిర్వహణ అవసరాలకు గాను జనసేన(Janasena) కోశాధికారి ఎ.వి రత్నంకు చెక్కును మంగళవారం అందజేశారు. పవన్కల్యాణ్ మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో అనేక మంది నాయకులు, ప్రజలు తాము కష్టార్జితంగా సంపాదించిన వాటిలో కొంత భాగం ఉద్యమ నిర్వహణకు నిధులు ఇచ్చారని తెలిపారు.
అదే స్ఫూర్తితో తాను సినిమా పరిశ్రమ(Film industry) ద్వారా సంపాదించిన దాంట్లో నుంచి ఎప్పటికప్పుడు పార్టీకి తన వంతుగా నిధులిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా రూ.10 కోట్లను పార్టీ నిర్వహణ, కార్యకలాపాలకు అందించానని వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ, పార్టీని నడపడం డబ్బుతో కూడుకుందని తెలిపారు. జనసేన పార్టీ పేదల నుంచి పెద్దల వరకు పార్టీ ఫండ్ కింద నిధులను పంపిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.