అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిశ్రమల్లో వెలువడే కాలుష్యంపై(Industrial pollution) పొల్యూషన్ ఆడిట్(Pollution audit) కచ్చితంగా చేయాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏయే పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా, గోదావరి నదీ జలాలు కలుషితంపై ప్రత్యేకంగా సమీక్షిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. మరోవైపు మన రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిపోయి నేపాల్ దేశంలో దొరుకుతున్న ఎర్ర చందనాన్ని వెనక్కి తీసుకురావాలని ఆదేశించారు. నేపాల్ దేశంలో 172 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం(Errachandanam) దొరికిందని మంత్రి పేర్కొన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ను బలోపేతం చేస్తామని తెలిపారు.