Vijaya Sai Reddy | జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ తన బాల్య మిత్రుడని వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఓ టీవీ ఛానెల్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయగా.. ప్రస్తుతం అవి వైరల్గా మారాయి. విపక్షాల నేతలను అందరినీ ఏ రేంజ్లో విమర్శిస్తారు కానీ పవన్ కల్యాణ్ను ఎందుకు విమర్శించరని ప్రశ్నించగా.. విజయ సాయిరెడ్డి స్పందిస్తూ.. పవన్ కల్యాణ్ తనకు బాల్యమిత్రుడు అంటూ కీలక విషయం బయటపెట్టారు.
పవన్ కల్యాణ్ సైతం తనను ఎన్నడూ విమర్శించలేదని ఆయన్న.. తాను గతంలో రాజకీయ అంశాలపై పవన్ కల్యాన్, జనసేనను విమర్శించానని తెలిపారు. ఎన్నికల సంఘానికి చెందిన ముగ్గురు సభ్యులు విజయవాడకు వచ్చిన సమయంలో సమావేశానికి తాను హాజరయ్యానన్నారు. ఆ సమావేశం ముగిశాక బయటికొచ్చి మీడియాతో మాట్లాడిన సమయంలో జనసేనను ఏ విధంగా విమర్శించాను.. పవన్ కల్యాన్ని ఏ విధంగా విమర్శించానో గమనించవచ్చన్నారు. అవసరాన్ని బట్టి, పరిస్థితులను బట్టి రాజకీయంగా విమర్శించడం తప్పదని.. విమర్శించాల్సిందేన్నారు. అవసరమైన సమయంలో పదునైన పదజాలంతో విమర్శిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబును, లోకేశ్ను విమర్శించినంత ఘాటుగా పవన్ని ఎందుకు విమర్శించడం లేదన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అవతల పవన్ కల్యాణ్ ఉన్నా.. ఇంకో రాజకీయ నాయకుడు ఉన్నా రాజకీయంగా విమర్శించాల్సి వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకాడబోనన్నారు. పవన్ కల్యాణే కాదు.. ఏ రాజకీయ నాయకుడి వ్యక్తిగత జీవితం గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదని.. పార్టీలో కొందరు నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తుండొచ్చు కానీ.. తాను అలాంటి వాటికి దూరమని విజయసాయిరెడ్డి స్పష్టం తెలిపారు.
పవన్ కల్యాణ్ నాకు బాల్యమిత్రుడు.. అందుకే..! | Cross Fire with MP Vijaysai Reddy – TV9 Rajinikanth#VijayaSaiReddy #RajinikanthVellalacheruvu #TV9Rajinikanth #CrossFire pic.twitter.com/rm62pQom3r
— TV9 Telugu (@TV9Telugu) April 11, 2024