అమరావతి: జనసేన నేత పవన్ కల్యాణ్పై వైసీపీ నాయకుడు , ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ జనాలకు ఏమి చెబుతున్నారో.. ఎందుకు చెప్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదని అతడొక కన్ఫ్య్జన్ మాస్టరని ఎద్దేవ చేశారు. విశాఖ ఉక్కుపై చేసిన దీక్షలో పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు.
పవన్ ఏమి చెప్పినా ఆవు కథ రాసేలా ఉందని ఆరోపించారు. విశాఖ ఉక్కు గురించి ధీక్ష చేస్తున్నామని అన్నారు.కాని ఎక్కడ దాని గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. బీజేపీతో పార్టనర్గా ఉండి ఉక్కు ప్రైవేటీకరణ గురించి మాట్లాడుతావా అని ప్రశ్నించారు. రాష్ట్రం అప్పులో ఉంటే రాష్ట్రం ప్రైవేటీకరణ చేస్తారా అని ప్రశ్నించిన ఆయన కేంద్రం రూ.121 లక్షల కోట్లు అప్పులో ఉంది.. మరి దేశాన్ని అమ్మేయలంటారా..అని పవన్ను ఎదురు ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని అంటున్నారు.. మరీ సినిమాల్లో వారసత్వాలకు వ్యతిరేకం కాదా అని పేర్కొన్నారు.