మంగళగిరి: తనకు సినిమాల్లోకి రావాలని లేకపోయినా వచ్చానని, కానీ రాజకీయాల్లోకి మాత్రం రావాలనే వచ్చానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. బుధవారం జరిగిన జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో కలుపుమొక్కలను ఏరిపారేయడం కోసమే తాను వచ్చినట్లు చెప్పారు. తాను ఏది అడిగినా ఆంధ్రప్రదేశ్ కోసమేనని, గతంలో టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చింది కూడా రాష్ట్రం కోసమేనని చెప్పాడు.
‘‘ఒకరి కష్టార్జితాన్ని దోచుకోవడానికి మీరెవరు? అని ప్రశ్నించా. నేను అడిగింది సినిమా థియేటర్ల గురించి, నాకేమన్నా థియేటర్లు ఉన్నాయా? వైసీపీ వాళ్లకే థియేటర్లుంది. మహానుభావులకు తల వంచుతాం, మీలాంటి వారి తాట తీస్తాం. ఏమైనా అంటే చాలు అరుస్తారు. మాట్లాడటం రాదా మీకు? ఏపీలో అసలు అభివృద్ధి లేదు. ఒక్కరోడ్డయినా వేశారా?’’ అని పవన్ దుయ్యబట్టారు.