అమరావతి : భారత రాజ్యాంగమే ప్రకారమే ఏపీలో విభజన చట్టం జరిగిందని పార్లమెంట్ సభ్యుడు సుజనా చౌదరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, శాసనసభకు చట్టాలు చేసే అధికారం ఉందని ఆయన పేర్కొన్నారు. 2014లో 175 మంది ఎమ్మెల్యేలు అమరావతే రాజధానిగా తీర్మానించారని గుర్తు చేశారు. నాడు అన్ని పార్టీలు అమరావతి రాజధానిగా అంగీకరించాయని వెల్లడించారు. సీఎంలు మారినప్పుడల్లా రాజధానిని మార్చడం మంచి పద్దతి కాదని అన్నారు.