అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గత రెండున్నర ఏండ్లుగా రాష్ట్రంలోని మీడియా, జర్నలిస్టులు అనేక కక్షసాధింపు చర్యలకు గురవుతున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని, పౌరుల ప్రాథమిక హక్కులను గంగలో కలుపుతున్నారని దుయ్యబట్టారు.
ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించిన వ్యవస్థలన్నింటినీ వైఎస్ జగన్ నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. సీబీఐ సంస్థ అధికార ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడం శోచనీయమని చంద్రబాబు వెల్లడించారు.