అమరావతి : మూడు రాష్ట్రాలో చోరీలకు పాల్పడుతూ భయాంతోళనలు సృష్టిస్తున్న పార్థీ, సత్తెనపల్లి చోరీ ముఠాలను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున నగదును, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో చోరీలకు పాల్పడుతున్న పార్థీగ్యాంగ్కు చెందిన డోల్సింగ్ కాలేను అరెస్టుచేసి రూ.12 లక్షల విలువైన 214 గ్రాముల బంగారం, 2,600 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం పోలీసులు తెలిపారు.
డోల్ సింగ్పై తెలంగాణలో 17, మహారాష్ట్రలో 4 చోరీ కేసులున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా సత్తెనపల్లి ముఠాకు చెందిన కుంతాల నాగరాజు, డేరంగుల అంకమరావు ఇద్దరిని పట్టుకున్నట్లు వారు వివరించారు. ఈ ముఠా నుంచి రూ. 14 లక్షల విలువైన 28 తులాల బంగారం, రూ. 40 వేల నగదును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.