భూపాలపల్లి: జిల్లాలోని మేడిగడ్డ ప్రాజెక్టు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బరాజ్ 5 గేట్లు ఎత్తిన అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 300 క్యూసెక్టులు ఉండగా.. 3600 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బరాజ్ పూర్తి సామర్థ్యం 16.17 టీఎంసీలుకాగా, ప్రస్తుత 11.679 టీఎంసీల నీటిమట్టం ఉన్నది. కన్నెపల్లి పంప్ హౌస్లో 11 మోటర్ల ద్వారా 23,100క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు.