తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కొండపైకి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొవిడ్ అనంతరం ప్రారంభించిన సర్వదర్శనానికి రికార్డు స్థాయిలో భక్తులు నిన్న స్వామివారిని దర్శించుకున్నారు. 89,665 భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 35,794 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీ హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 7 గంటలలో దర్శనం అవుతుందని వివరించారు.