తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ట్రస్ట్ కు ఓ దాత భారీగా విరాళం అందించారు. టీటీడీ కి చెందిన నాలుగు ట్రస్టులకు గురువారం రూ. కోటి విరాళంగా ఇచ్చారు. చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్ ఝాన్సీరాణి టీటీడీకి భారీగా విరాళం అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో విరాళం చెక్కును ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్బాబుకు అందజేశారు.
ఆమె ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.25 లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.25 లక్షలు, బర్డ్ ట్రస్టుకు రూ.25 లక్షలు, ఎస్వీ సర్వ శ్రేయస్సు ట్రస్టుకు రూ.25 లక్షలు అందించారు.