అమరావతి : ఏనుగుల గుంపు ఒక్కసారిగా దాడిచేసిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. నిన్న రాత్రి తమిళనాడు అడవుల నుంచి ఏపీ పరిధి గుడిపల్లె మండలం చిగురుగుంట అటవీ ప్రాంతానికి ఏనుగుల గుంపు చేరుకు న్నాయి. అక్కడే నివాసముంటున్న వారిపై దాడి చేయగా దాడిలో తమిళనాడువాసి గోవిందు మృతి చెందగా గుడిపల్లె మండలం శ్రీనివాసపురానికి చెందిన నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ నాగరాజును స్థానికులు ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.