తిరుపతి : బర్డ్ ఆసుపత్రి లో అందుబాటు లో ఉన్న మూడు వార్డులను అభివృద్ధి చేసి రోగుల కోసం మరో వంద పడకలు అందుబాటులోకి తేవాలని బర్డ్ ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది . టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో బర్ద్ ట్రస్ట్ బోర్డు సమావేశం జరిగింది . బర్డ్ లో స్మైల్ ట్రయిన్ ద్వారా గ్రహణమొర్రి ,కాక్లియర్ ఇంప్లాంట్ సేవలు త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని చైర్మన్ ఆదేశించారు .
నగదు చెల్లించి మో కీలు, తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకునే రోగులకు దేశీయ , విదేశీ ఇంప్లాంట్ ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆదేశించారు . టీటీడీ ఈవో , బర్డ్ ఎండి ఎ వి ధర్మారెడ్డి , జెఈవో లుసదా భార్గవి , వీర బ్రహ్మం, బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి పాల్గొన్నారు.