AP News | ఏపీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని ఓ మేజర్ పంచాయతీలో ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కిరాణ షాపునకు వచ్చిన బాలికపై అత్యాచారం చేశాడు.
ఈ ఘటనపై బాధిత చిన్నారి తల్లిదండ్రులు ఆచంట పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చికిత్స, వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.