అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి ఒంటిపూట బడులు (Half days Schools) మొదలుకానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు (Students) ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించనున్నారు.
ప్రభుత్వ, జిల్లా పరిషత్(Zilla Parishad), మున్సి పల్(Muncipal), మోడల్స్కూల్స్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్మెంట్లలో ఒంటి పూట బడులు పక్కాగా అమలు కావాల్సిందేనని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 18వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు వర్తిస్తాయని తెలిపారు. అయితే పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే ఏడు రోజులపాటు 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.