అమరావతి : విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 24, 25వ వార్షిక స్నాతకోత్సవాలు రేపు (శుక్రవారం) నిర్వహిస్తున్నామని ఉప కులపతి డాక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ ఉత్సవాలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్గా అధ్యక్షత వహిస్తారని వెల్లడించారు. ముఖ్యంగా గుండె వైద్య పరిశోదనలు, వైద్య రంగంలో అత్యుత్తమ సేవలందించిన నిపుణులు స్విమ్స్ మాజీ ఉపకులపతి డాక్టర్ జి.సుబ్రహ్మణ్యంకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీచే గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేయనున్నామని పేర్కొన్నారు .
2018 ఏడాదికి నిర్వహిస్తున్న 24వ వార్షిక స్నాతకోత్సవంలో మొత్తం 67 మంది వైద్య విద్యార్థులో 58 బంగారు, 21 రజత పతకాలు ,23 మందికి నగదు పురస్కారాలు అందించనున్నామని వివరించారు. 2019 ఏడాదికి నిర్వహించే 25 వ వార్షిక స్నాతకోత్సవంలో 60 మంది వైద్య విద్యార్థుల్లో 55 మందికి బంగారు, 18 మందికి రజత పతకాలు,24 మందికి నగదు బహుమతులు అందించనున్నామని తెలిపారు.
పీహెచ్డీ(డాక్టరేట్) కోర్సు పూర్తి చేసిన ఐదుగురికి, పీజీ డిగ్రీ/డిప్లొమా పూర్తి చేసుకున్న 10 మందికి పట్టాలు అందించనున్నామని వివరించారు.