తిరుమల : అమెరికాలోని ( America ) బోస్టన్కు చెందిన ప్రవాసాంధ్రుడు ( NRI ) ఆనంద్ మోహన్ భాగవతుల గురువారం టీటీడీ( TTD) లోని వివిధ ట్రస్టులకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బీ ఆర్ నాయుడుకు విరాళాలకు సంబంధించిన డీడీలను అందజేశారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు రూ.కోటి 1,116, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్, ఎస్వీ విద్యా దాన ట్రస్ట్కు , ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్ట్కు, ఎస్వీ సర్వశ్రేయస్ ట్రస్ట్కు రూ.10,01,116 చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా వివిధ ట్రస్ట్ లకు విరాళాలు అందించిన దాతను చైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు.