అమరావతి : మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్కుమార్కు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఈరోజు ఉదయం హైదరాబాద్లోని కొండాపూర్లో ఉంటున్న ఆయన ఇంటికి ముగ్గురు పోలీసులు వచ్చి నోటీసులు అందజేశారు. ఓ కేసు విషయంలో ఈనెల 22న విజయవాడకు రావాలని రమేశ్ తల్లిదండ్రులకు నోటీసులు అందజేశారు. ఏ కేసు విషయంలో నోటీసులు ఇచ్చారన్నది తెలియరాలేదు.