అమరావతి : తెలుగుదేశం పార్టీ, అధినేత చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తలను విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి ఖండించారు. తాను అసంతృప్తిగా లేనని స్పష్టం చేశారు. ఇవాళ విజయవాడలో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొందరూ తనపై లేనిపోని కల్పితాలు సృష్టించడం తగదని అన్నారు. తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా లేకున్నా విజయవాడకు జరిగే నష్టం ఏమీ లేదని పేర్కొన్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం, ప్రైవేట్ వ్యవహారం కాదని మహిళలకు సంబంధించిన విషయమని అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. కరోనాతో ప్రపంచమే అల్లకల్లోలమైతే దానికి వ్యాక్సిన్ను కనుగొని అందరకి పంచిన ఘనత భారత్కు దక్కిందని వెల్లడించారు.