అమరావతి : చట్టానికి ఎవరూ అతీతులు కారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కాకినాడ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ హత్య ఘటనపై చర్యలకు సీఎం జగన్ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. తప్పు చేస్తే ఎమ్మెల్సీ అయిన చర్యలు తప్పవని వెల్లడించారు. టీడీపీ నాయకుడు నారా లోకేశ్ వైసీపీ నాయకులను ఏకవచనంతో బోధించడం అత్యంత దారుణమని, ఏ ఎన్నికల్లో గెలవని లోకేశ్కు విమర్శించే హక్కు లేదని వ్యాఖ్యనించారు.
2018 వరకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఎందుకు నెరవేర్చుకోలేక పోయారని టీడీపీ నాయకులను ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయం వల్ల పోలవరం పూర్తి కావడం లేదని విమర్శించారు. జగన్ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. జగన్ను ఓడించడానికి అందరూ ఏకమైన ఏం చేయలేరని అన్నారు.