ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి జనవరి 31 వరకూ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకూ నైట్ కర్ఫ్యూ వుంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అత్యవసర సేవలు, పెట్రో బంకులు, వైద్యులు, మెడికల్ సిబ్బంది లాంటి వాటికి మాత్రం మినహాయింపు ఉంటుందన్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల నుంచి రాకపోకలు చేసే వారికి, సరుకు రవాణా వాహనాలకు కూడా మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దుకాణాలు, వాణిజ్య సంస్థలు కచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని ,లేదంటే 10 వేల నుంచి 25 వేల వరకూ జరిమానా విధించాల్సి వుంటుందని ప్రభుత్వం హెచ్చరించింది.