అమరావతి: వ్వవసాయ సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం అగ్రి పాలిసెట్ (Agri polycet) నోటిఫికేషన్ను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 2022-23 విద్యాసంవత్సరానికిగాను వ్యవసాయ, పశువైద్య, ఉద్యానవన, మత్స్య వర్సిటీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు నేటినుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసువాలని సూచించింది. ప్రవేశ పరీక్షను జూలై 1న నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500
దరఖాస్తుల ప్రారంభం: మే 18
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 1
ప్రవేశపరీక్ష: జూలై 1
వెబ్సైట్: www.angrau.ac.in