Chandrababu | టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని.. ఆయన మాటలను ప్రజలు నమ్మరని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు వైసీపీదే అని స్పష్టం చేశారు.
చంద్రబాబులా కుర్చీ లాక్కునే అలవాటు తనకు లేదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. తనపై విమర్శలు చేస్తున్న నేతలు.. ఆ లక్షణాలు మీ అధినేతకే ఉన్నాయని తెలుసుకోండని సూచించారు. చంద్రబాబు, దత్తపుత్రుడి మాటలను ప్రజలు నమ్మరని విమర్శించారు. వంద రోజుల్లోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని మంత్రి జోగి రమేశ్ విమర్శించారు. దత్తపుత్రుడు, ఢిల్లీ పార్టీ కూడా ఆయనతో ఉన్నారని ఆరోపించారు.
చంద్రబాబు టికెట్లు అమ్ముకుని తెలంగాణ వెళ్లిపోతారని విజయవాడ ఎంపీ కేశినేని ఆరోపించారు. వచ్చే ఎన్నికలే చంద్రబాబుకు చివరివి అని అన్నారు. జగన్ను చూసి చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలని విమర్శించారు.