అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 7,796 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 14,641 మంది కోలుకున్నారు. 77 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 1,77,1007 చేరాయి. 1,65,1790 మంది కోలుకున్నారు. ఇంకా 1,07,588 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 11,629కి పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 89,732 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.