అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,068 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,127 మంది బాధితులు చికిత్సకు కోలుకున్నారు. మరో 22 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 19,64,117 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 19,29,565 కోలుకున్నట్లు తెలిపింది. మొత్తం 21,198 యాక్టివ్ కేసులున్నాయి. మృతుల సంఖ్య 13,354కు పెరిగినట్లు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 80,641 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.