అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 1,859 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 1,575 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇన్ఫెక్షన్ కారణంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 19,88,910కి పెరిగాయి. ఇవాళ్టివరకు 19,56,627 మంది కోలుకున్నారు. మరో 18,688 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,595కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల వ్యవధిలో 70,757 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది.