అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుతున్నా మరణాలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,540 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,304 మంది బాధితులు చికిత్సకు కోలుకున్నారు. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,57,932కు పెరిగింది. ఇవాళ్టివరకు 19,23,675 మంది కోలుకున్నారు. మరో 20,965 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాలు 13,292కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 61,298 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కడప జిల్లాలో దారుణం : సర్పంచ్ను నరికి చంపిన ప్రత్యర్థులు
స్థానిక ఆలయాల అభివృద్ధిపై టీటీడీ దృష్టి…
ఆగస్టు 4 నుంచి శ్రీ కోదండరామాలయంలో పవిత్రోత్సవాలు