అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రులు కొలువుదీరారు. ఇవాళ ఏపీ సచివాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. వారు ఏఏ సామాజిక వర్గం, ఏఏ నియోజక వర్గం నుంచి వచ్చిన వారు అనే వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ)నియోజకవర్గం-పుంగనూరు , ఆదిమూలపు సురేష్ (ఎస్సీ) నియోజకవర్గం-యర్రగొండ పాలెం కళత్తూరు నారాయణస్వామి (ఎస్సీ)నియోజకవర్గం-గంగాధరనెల్లూరు (ఎస్సీ), చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (బీసీ)నియోజకవర్గం-రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
బొత్స సత్యనారాయణ (బీసీ) నియోజకవర్గం- చీపురుపల్లి , తానేటి వనిత (ఎస్సీ)నియోజకవర్గం-కొవ్వూరు, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి (ఓసీ) నియోజకవర్గం- డోన్ , కారుమూరి వెంకట నాగేశ్వరరావు (బీసీ) నియోజకవర్గం-తణుకు, గుమ్మనూరు జయరాం (బీసీ) నియోజకవర్గం- ఆలూరు, జోగి రమేష్ (బీసీ) నియోజకవర్గం- పెడన , సీదిరి అప్పలరాజు (బీసీ)నియోజకవర్గం-పలాస నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గుడివాడ అమర్నాథ్ (ఓసీ) నియోజకవర్గం అనకాపల్లి , షేక్ బేపారి అంజాద్ బాషా (మైనార్టీ) నియోజకవర్గం-కడప, అంబటి రాంబాబు (ఓసీ) నియోజకవర్గం-సత్తెనపల్లి, పినిపే విశ్వరూప్ (ఎస్సీ) నియోజకవర్గం-అమలాపురం, కె.వి.ఉషశ్రీచరణ్ (బీసీ) నియోజకవర్గం-కళ్యాణదుర్గం, ధర్మాన ప్రసాదరావు (బీసీ) నియోజకవర్గం-శ్రీకాకుళం , విడదల రజిని (బీసీ)నియోజకవర్గం-చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆర్.కె.రోజా (ఓసీ) నియోజకవర్గం-నగరి, మేరుగ నాగార్జున (ఎస్సీ) నియోజకవర్గం- వేమూరు, బూడి ముత్యాలనాయుడు (బీసీ) నియోజకవర్గం-మాడుగుల, కొట్టు సత్యనారాయణ (ఓసీ)నియోజకవర్గం-తాడేపల్లిగూడెం, పీడిక రాజన్నదొర (ఎస్టీ)నియోజకవర్గం-సాలూరు, దాడిశెట్టి రాజా (ఓసీ) నియోజకవర్గం-తుని, కాకాణి గోవర్ధన్రెడ్డి (ఓసీ)నియోజకవర్గం-సర్వేపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.