Kotamreddy Sridhar reddy | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో కొద్దిరోజులుగా వార్తల్లో నిలిచిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భద్రతను తాజాగా కుదించారు. 2+2 గన్మెన్లలో ఇద్దరిని రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. బెదిరింపు కాల్స్ వస్తున్న ఈ తరుణంలో తనకు ఉన్న భద్రతను కుదించడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. మిగిలిన ఇద్దరు గన్మెన్లు కూడా అక్కర్లేదు.. మీకే పంపిస్తున్నా అంటూ వాళ్లను తిరస్కరించారు. ప్రెస్మీట్ పెట్టి మరీ కోటంరెడ్డి ఈ విషయం చెప్పారు. అయితే కోటంరెడ్డిని వదిలివెళ్లేందుకు గన్మెన్లకు మనసు ఒప్పుకులేదు. అన్నా నిన్ను వదిలి వెళ్లలేమూ అంటూ ఎమ్మెల్యేను చూస్తూ ఎమోషనల్ అయ్యారు. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ గన్మెన్లను కోటంరెడ్డి ఓదార్చారు. గుండెలకు హత్తుకుని భావోద్వేగానికి లోనయ్యారు. వాళ్లకు అండగా ఉంటానని ప్రకటించారు.
గన్మెన్లను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఎవరి ఆదేశాలతో చేశారో తెలియదు గానీ.. ప్రభుత్వ పెద్దలు చెప్పకుండా జరగదని అన్నారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్న ఈ సమయంలో అదనపు భద్రత కల్పించాల్సింది పోయి.. ఉన్న వాళ్లను తొలగిస్తారా? అని మండిప్డడారు. ఇద్దరు గన్మెన్లతో పాటు మిగిలిన ఇద్దరు గన్మెన్లను కూడా మీకే గిఫ్ట్ ఇస్తున్నా.. తీసుకోండి అని అన్నారు. ఇకపై ఎక్కడైనా ఒంటరిగానే తిరుగుతానని.. ఎవరికీ భయపడనని స్పష్టం చేశారు.
మహారాష్ట్రకు నీళ్లు ఇచ్చేందుకు సిద్ధం : సీఎం కేసీఆర్